కలం, ఆలేరు బ్యూరో: యాదగిరిగుట్ట (Yadagirigutta) లక్ష్మీనరసింహ స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు (Brahmotsavam) అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నాల్గవ రోజు స్వామివారు వటపత్రశాయిగా భక్తులకు దర్శనం ఇచ్చారు. శనివారం ప్రధానాలయంలో ద్వారతోరణ, ధ్వజ కుంభారాధన, అగ్ని ఆరాధన, మూల మంత్ర, పంచసూక్త హవనం లాంటి పూజలు వైభవంగా జరిగాయి. వటపత్రశాయిగా ప్రత్యేక పల్లకీపై స్వామివారి భక్తులకు ఆకట్టుకున్నారు. స్వామివారి అలంకార సేవకు ముందు వేదపండితులు దివ్య ప్రబంధ వేద పారాయణాలు, మూల మంత్ర జప పఠనాలు గావించారు. అనంతరం డోలు సన్నాయి, మేళాలతో స్వామివారిని మాడ వీధుల్లో వైభవంగా ఊరేగించారు.
Read Also: భర్త అతడి ప్రియుడితో భార్యకు ముప్పు.. ధర్మవరంలో విచిత్ర ఫిర్యాదు
Follow Us On: Youtube


