కలం, వెబ్ డెస్క్: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ అంటే వ్యూయర్ షిప్ ఎక్కువ ఉండటం కొత్త విషయం ఏమీ కాదు. కానీ అది వరల్డ్ కప్ ఫైనల్ను దాటేస్తే.. ఇది నిజంగా హైలెట్. అవును.. 2025 వరల్డ్ కప్లో భారత్, పాక్ మధ్య జరిగిన మ్యాచ్ ఈ రికార్డ్ చేసింది. ఇది చూసి బ్రాడ్ కాస్టర్స్ కూడా షాక్ అవుతున్నారు. టీ20 2026లో (T20 World Cup) భారత్-పాకిస్థాన్ మ్యాచ్ 2024 వరల్డ్ కప్ ఫైనల్ రీచ్ను దాటింది. జియో హాట్స్టార్ ప్రకారం ఈ మ్యాచ్ 163 మిలియన్ డిజిటల్ రీచ్ సాధించింది. ఇప్పటి వరకు ఐసీసీ T20 మ్యాచ్లో అత్యధిక వ్యూయర్షిప్ సాధించిన మ్యాచ్గా నిలిచింది.
భారత్ విజయం 56% పెరుగుదల తీసుకువచ్చింది. మొబైల్లో లీగ్ స్టేజ్లో ఈ మ్యాచ్ గరిష్ట రీచ్ సాధించింది. గత 2024 భారత్-పాక్ మ్యాచ్తో పోలిస్తే 1.2 రెట్లు ఎక్కువ వ్యూయర్షిప్ రికార్డు వచ్చింది. సీటీవీలో ఈ మ్యాచ్ రీచ్ 2.4 రెట్లు పెరిగింది. సమగ్రంగా 20 బిలియన్ నిమిషాల వ్యూయర్ టైమ్ నమోదు అయ్యింది, 42% ఎక్కువగా. భారత్ టీ20 వరల్డ్ కప్లో పాకిస్తాన్పై 8-1 హెడ్-టు-హెడ్ రికార్డ్ కొనసాగించింది.
టీవీఆర్ 71% పెరిగి 2021 తర్వాత అత్యధిక రేటింగ్ సాధించింది. సాంప్రదాయ ప్రసారం కూడా భారీ వ్యూయర్ అనుభవాన్ని అందించింది. జీయో హాట్స్టార్ ప్రతినిధి అనూమ్ గోవిందన్ ఈ అంశంపై స్పందించారు. మ్యాచ్ రికార్డులు ఫ్యాన్స్ ఆకర్షణను చూపించాయన్నారు. ఈ గణాంకాలు టీ20 2026పై భారత అభిమానుల ఉత్సాహం కొనసాగుతుందన్నదీ తెలిపారు. భారత్ ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభమయ్యే టీ20 2026 సూపర్ 8 దశకు చేరింది. డిఫెండింగ్ ఛాంపియన్లు విజయం సాధించి రికార్డులు మరల సృష్టించాలనుకుంటున్నారు.


