కలం, వెబ్ డెస్క్: అమ్రాబాద్ నల్లమల అడవి (Nallamala Forest)లో కార్చిచ్చు చెలరేగింది. బ్రహ్మగిరి, దోమలపెంట రేంజ్ పరిధిలో భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. వజ్రాలమడుగు, తవిసిపెంట సమీపంలో మంటలకు వందల హెక్టార్ల భూమి దగ్ధమవుతోంది. శ్రీశైలం-హైదరాబాద్ రోడ్డు వెంబడి దట్టమైన పొగ వ్యాపించింది. మంటలు ఆర్పేందుకు అటవీ శాఖ అధికారులు రంగంలోకి దిగారు. అసలు మంటలు ఎలా అంటుకున్నాయన్నది తెలియాల్సి ఉంది.


