కలం, సినిమా : టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు(Mahesh Babu), దర్శక ధీరుడు రాజమౌళి (Rajamouli) కాంబినేషన్లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ పాన్ వరల్డ్ మూవీ “వారణాసి” (Varanasi). దుర్గా ఆర్ట్స్ బ్యానర్పై కేఎల్ నారాయణ నిర్మాణంలో ఏకంగా 1000 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో మహేశ్ సరసన గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా.. మలయాళం స్టార్ పృద్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.
అలాగే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ సైతం తాను ఈ సినిమాలో మహా శివ భక్తునిగా నటిస్తున్నట్లు అప్డేట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దర్శకుడు రాజమౌళి వారణాసి సినిమాను భారీ విజువల్ వండర్గా తెరకెక్కిస్తున్నారు. అయితే ఈ సినిమాలోని త్రేతాయుగం రామాయణం ఎపిసోడ్ సినిమాకే హైలెట్ కానుంది. కేవలం ఈ ఒక్క ఎపిసోడ్ కే ఏకంగా 300 కోట్ల బడ్జెట్ కేటాయించినట్లు న్యూస్ వైరల్ అవుతుంది. ఇప్పటికే ఈ రామాయణ ఎపిసోడ్ షూట్ చేసి VFX వర్క్ కోసం పంపినట్లు రాజమౌళి తెలిపారు. రామాయణ ఎపిసోడ్ చూశాక ఫ్యాన్స్ కి గూస్ బుంప్స్ గ్యారెంటీ అని రాజమౌళి హామీ ఇచ్చారు.


