కలం, వెబ్డెస్క్: ఆన్లైన్ వార్తల పోర్టల్ ‘న్యూస్క్లిక్’పై (NewsClick) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కొరడా ఝలిపించింది. విదేశీ మారకద్రవ్య చట్టం నిర్వహణ(ఫెమా) కింద న్యూస్క్లిక్తోపాటు దాని వ్యవస్థాపకుడు, ఎడిటర్ ఇన్ ఛీప్ ప్రబిర్ పుర్కాయస్థకు రూ.184కోట్ల పెనాల్టీ నోటీస్ జారీ చేసింది. ఇందులో న్యూస్క్లిక్కు రూ.120 కోట్లు, పుర్కాయస్థకు రూ.64కోట్లు జరిమానా విధించింది. ఈ మేరకు ఈడీ సోమవారం నోటీసులు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్డీఐ) నిధులు, సేవలు, ఎగుమతుల ప్రకటనల్లో అవకతవకలకు పాల్పడి ఫెమా నిబంధనలు అతిక్రమించినట్లు న్యూస్క్లిక్పై ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, తప్పుడు ప్రచారంతో దేశ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడం, ప్రజల్లో అసంతృప్తి రేకెత్తించడం లక్ష్యంగా న్యూస్క్లిక్కు నిధులు అందినట్లు ఈడీ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు.
2019 లోక్సభ ఎన్నికలను ప్రభావితం చేయాలనే కుట్రలో భాగంగా పీపుల్స్ అలయెన్స్ ఫర్ డెమొక్రసీ అండ్ సెక్యులరిజం సంస్థతో కలసి పనిచేశారనే ఆరోపణలూ పుర్కాయస్థ(Prabir Purkayastha) మీద ఉన్నాయి. చైనా అనుకూల ప్రచారం కోసం విదేశాల నుంచి నిధులు స్వీకరించారనే కేసులో 2023 అక్టోబర్ 3న పుర్కాయస్థను అరెస్ట్ చేశారు. ఆ తర్వాత ఆయన బెయిల్పై విడుదలయ్యారు. ఈ కేసులో న్యూస్క్లిక్ (NewsClick) హెచ్ఆర్ హెడ్ అమిత్ చక్రవర్తిని కూడా ఉగ్రవాద వ్యతిరేక చట్టం – ఉపా కింద అరెస్టు చేశారు. పలువురు జర్నలిస్టులను విచారించారు.
Read Also: మానవ సంక్షేమం కోసం ఏఐ ఉపయోగపడాలి : ప్రధాని మోదీ
Follow Us On: Pinterest


