కలం, డెస్క్ : తెలంగాణ ప్రభుత్వం (Telangana Govt) రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. సన్నవరి వేసిన వారికి రూ.500 బోనస్ నిధులకు (Paddy Bonus Funds) సంబంధించిన బకాయిలు రూ.514.36 కోట్లు తాజాగా ప్రభుత్వం రిలీజ్ చేసింది. రాష్ట్రంలోని 2.17 లక్షల మంది రైతుల ఖాతాల్లో ఈ డబ్బులు జమ కానున్నాయి. వీరందరూ 2025-26 సంవత్సరంలో సన్నవరి వేసిన వారని ప్రభుత్వం తెలిపింది. సన్నవరిని ప్రోత్సహించడం కోసం ప్రభుత్వం ఈ బోనస్ ఇస్తున్న సంగతి తెలిసిందే. వరి కోతలు అయినప్పుడే ప్రభుత్వం కొంత నిధులను విడుదల చేసింది. కానీ అందులో ఇంకా పెండింగ్ ఉండటంతో.. వాటిని ఇప్పుడు రిలీజ్ చేసింది.
Read Also: మున్సిపల్ ఫలితాలు.. ప్రతిపక్షాలకు చెంపపెట్టు : డిప్యూటీ సీఎం భట్టి
Follow Us On: Instagram


