epaper
Wednesday, February 18, 2026
epaper

విజయం వారికే అంకితం : మున్సిపల్ ఫలితాలపై సీఎం రేవంత్

కలం, వెబ్​ డెస్క్​ : రాష్ట్ర వ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్ల పరిధిలో కాంగ్రెస్ పార్టీకి అఖండ మెజారిటీని అందించిన రాష్ట్ర ప్రజలకు సీఎం రేవంత్​ రెడ్డి (Revanth Reddy) హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ విజయం రాష్ట్రంలో కొనసాగుతున్న ప్రజా పాలనకు లభించిన సంపూర్ణ ఆమోదమని ఆయన పేర్కొన్నారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై  ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్స్ (ట్విట్టర్​) వేదికగా స్పందించారు.

ఈ గెలుపు వెనుక లక్షలాది మంది కాంగ్రెస్ కార్యకర్తల అలుపెరుగని శ్రమ దాగి ఉందని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. పార్టీ జెండాను భుజాలు కాయలు కాసేలా మోసి, ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేసిన ప్రతి కార్యకర్తకు ఈ విజయాన్ని అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. కార్యకర్తలు పార్టీ పట్ల కనబరిచిన అభిమానానికి ఈ ఫలితాలే నిదర్శనమని ఆయన తెలిపారు.

గడిచిన రెండేళ్లలో పేద, మధ్యతరగతి ప్రజల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేసిన కార్యక్రమాలు, ప్రపంచ స్థాయి ప్రణాళికలు, అభివృద్ధి కార్యాచరణకు ప్రజలు ఈ తీర్పు ద్వారా మద్దతు తెలిపారని సీఎం వివరించారు. ఈ విజయం ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచిందని, భవిష్యత్తులో ప్రతి మున్సిపాలిటీ, కార్పొరేషన్‌ను ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. పారదర్శక పాలనతో ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి పునరంకితమవుతామని రేవంత్ రెడ్డి (Revanth Reddy) పేర్కొన్నారు.

Read Also: ఉమ్మడి జిల్లాలోని మున్సిపాలిటీలలో హస్తం హవా

Follow Us On: Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>