epaper
Wednesday, February 18, 2026
epaper

తెలంగాణలో బీజేపీ ప్రత్యామ్నాయం : రామచందర్​ రావు

కలం, వెబ్ డెస్క్​ :​ తెలంగాణలో కాంగ్రెస్​, బీఆర్​ఎస్​ పార్టీలకు బీజేపీ (BRS) ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ చీఫ్​ రాంచందర్​ రావు (Ramchander Rao) అన్నారు. మున్సిపల్​ ఎన్నికల ఫలితాలపై స్పందించిన ఆయన.. శుక్రవారం మీడియాతో మాట్లాడారు. మున్సిపల్​ ఎన్నికల్లో (Municipal Elections) బీజేపీ ఓట్ల శాతం పెరిగింది అని చెప్పారు. కాంగ్రెస్​, ఎంఐఎం, బీఆర్​ఎస్​ కుట్రలు చేయడంతో కొన్ని స్థానాల్లో ఓడిపోయామని చెప్పారు. అయినా, పార్టీకి రాష్ట్రంలో బలం పెరిగిందని.. బీఆర్​ఎస్ (BRS)​ బలం తగ్గిందని తెలిపారు.

చాలా చోట్ల స్వల్ప తేడాతో ఓడిపోయామని.. కొత్తగూడెం, వైరాలో తొలిసారి విజయం సాధించామన్నారు. పోలీసులు, దౌర్జన్యాలు, అధికార దుర్వినియోగంతో కాంగ్రెస్​ పార్టీ గెలిచిందని రాంచందర్​ రావు ఆరోపించారు. హంగు ఏర్పడిన స్థానాల్లో ఏ పార్టీకి సపోర్ట్​ చేయం అని స్పష్టం చేశారు. మున్సిపల్​ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో బీజేపీకి ఫలితాలు వచ్చాయని.. వచ్చిన రిజల్ట్స్​ పై తాము సంతృప్తిగా ఉన్నామని ఆయన (Ramchander Rao) వెల్లడించారు. రాబోయే ఎన్నికల్లోనూ ఇదే విధంగా బీజేపీ దూసుకెళ్తుందని ధీమా వ్యక్తం చేశారు.

Read Also: ప్రజా పాలనకు బ్రహ్మరథం : టీపీసీసీ చీఫ్​ మహేష్​ గౌడ్​

Follow Us On: Sharechat

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>