కలం, డెస్క్ : తెలంగాణలో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల (Municipal Elections) కౌంటింగ్ లో ఆసక్తికర ఫలితాలు కనిపిస్తున్నాయి. దేవరకద్ర, అలంపూర్, కేసముద్రంలో హంగ్ ఏర్పడింది. దేవరకద్రలో మొత్తం 12 వార్డులు ఉండగా.. కాంగ్రెస్ కు 6, బీఆర్ ఎస్ 6 సీట్లలో గెలిచాయి. దీంతో ఎవరికీ మెజార్టీ రాలేదు. అలంపూర్ లో 10 వార్డులు ఉంటే.. కాంగ్రెస్ కు ఐదు, బీఆర్ ఎస్ ఐదు స్థానాలు దక్కాయి. ఇక్కడ కూడా ఎవరికీ మెజార్టీ రాలేదు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో 16 స్థానాలుంటే.. 8 కాంగ్రెస్ కు, 8 బీఆర్ ఎస్ కు వచ్చాయి. దీంతో ఈ మూడు మున్సిపాలిటీల్లో పార్టీలు మంతనాలు మొదలు పెట్టాయి. అవతలి పార్టీ నుంచి ఎవరో ఒకరిని లాగేసుకోవాలని చాలానే ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఒకవేళ ఎవరికీ మెజార్టీ రాకపోతే టాస్ వేసే ఛాన్స్ ఉందని అంటున్నారు అధికారులు.


