కలం, వెబ్ డెస్క్ : టీ20 వరల్డ్ కప్లో (T20 World Cup) భారత్ అటాక్ మోడ్లో ముందుకు వెళ్లాలా? డిఫెన్సివ్ స్ట్రాటజీని ఫాలో కావాలా? ప్రస్తుతం భారీగా చర్చకు దారితీసిన అంశాల్లో ఇది కూడా ఒకటి. ఇప్పటికే భారత్పై తాము అటాక్ మోడ్లో ఆడతామని పాక్ ప్రకటించడంతో.. భారత్ ఎలా ఆడాలి? అన్నది మరీ కీలకంగా మారంది. వరల్డ్ కప్లో యూఎస్ఏతో ఆడిన తొలి మ్యాచ్లో అటాకింగ్గా ఆడి భారత బ్యాటర్లు బొక్కబోర్లా పడ్డారు. దీంతో డిఫెన్స్ మోడ్ బెస్టేమో అన్న వాదన కూడా బలంగా వినిపిస్తోంది. ఈ క్రమంలోనే భారత్ ఆటతీరుపై మాజీ ప్లేయర్ పార్దీవ్ పటేల్ (Parthiv Patel) ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. యూఎస్ఏతో మ్యాచ్లో టాప్ ఆర్డర్ కుప్పకూలినా వ్యూహం మార్చొద్దని పటేల్ సూచించాడు. టీ20 వరల్డ్ కప్ 2026లో నమీబియాతో జరిగే తదుపరి మ్యాచ్కు ముందు ఆయన స్పష్టమైన సందేశం ఇచ్చారు.
టోర్నమెంట్ ఆరంభం నుంచి భారత్ హై-రిస్క్, హై-రివార్డ్ శైలిని అవలంబిస్తోంది. ముఖ్యంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ దూకుడుతోనే జట్టు మంచి ఆరంభాలు అందుకుంది. యూఎస్ఏ మ్యాచ్లో మాత్రం ఆ వ్యూహం పనిచేయలేదు. ఒక మ్యాచ్ ఫలితంతో తత్వం మార్చకూడదని పార్ధివ్ అభిప్రాయపడ్డారు. వరల్డ్ కప్ లాంటి టోర్నీలో పాత్రలు స్పష్టంగా ఉండటం కీలకమని చెప్పారు. అభిషేక్ గత ఏడాది కాలంగా సిక్సర్లతో దూసుకెళ్తున్న తీరు అలాగే కొనసాగించాలని సూచించారు. స్టంప్ ప్రాంతంలో పడే బంతులను స్క్వేర్ లెగ్ వైపు ఎగరేస్తూ ఆడటం ఆయన బలం అని వివరించారు. నమీబియా బౌలర్లు ఈ బలహీనతలను లక్ష్యంగా చేసుకోవచ్చని ఆయన విశ్లేషించారు. వైడ్ లైన్లో బంతులు వేస్తే అభిషేక్ దూరంగా ఉండే అవకాశం ఉందని చెప్పారు.
అదే విధంగా ఇషాన్ కిషన్కు ఫుల్ లెంగ్త్ బంతులు వేస్తే అతడు ఎలివేషన్ సాధించలేడని వివరించారు. అయితే ఒక వైఫల్యంతో ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని పార్ధివ్ (Parthiv Patel) స్పష్టం చేశారు. తమ బలాలపైనే దృష్టి పెట్టాలని సూచించారు. స్ట్రోక్ ప్లేకు అనుకూల పరిస్థితులు ఉండే అవకాశముందని చెప్పారు. ఫిబ్రవరి 12న ఢిల్లీ అరుణ్ జైట్లీ స్టేడియంలో నమీబియాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్లో ఓపెనర్లు ఎలా స్పందిస్తారన్నదే జట్టు గమ్యాన్ని నిర్ణయించవచ్చు. టోర్నమెంట్ ముమ్మర దశలోకి ప్రవేశిస్తున్న వేళ, దూకుడు, పరిస్థితి అవగాహన మధ్య సమతుల్యతే కీలకమవుతుంది.
Read Also: 2013 బెట్టింగ్ స్కామ్.. రూ.10 లక్షలు కట్టనున్న ధోనీ
Follow Us On: X(Twitter)


