కలం, వెబ్ డెస్క్ : నాంపల్లి (Nampally) లోని ఎఫ్ఎస్ఎల్ (FSL) కార్యాలయంలో జరిగిన అగ్నిప్రమాదానికి గల కారణాలను ఫైర్ డీజీ విక్రమ్ సింగ్ (Fire DG Vikram Singh) వెల్లడించారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన డీజీ మీడియాతో మాట్లాడారు. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణం అని గుర్తించినట్లు ఆయన తెలిపారు. ల్యాబ్ లో ఉన్న కంప్యూటర్లు, ప్రింటర్లు, హార్డ్ డిస్క్ లు మొత్తం కాలిపోయాయన్నారు. ఇలాంటి ఘటనలు జరగకుండా రెసిడెన్షియల్, కమర్షియల్, ప్రభుత్వ కార్యాలయాల్లో ఫైర్ సేఫ్టీ బృందాలు తనిఖీలు చేపడుతోందని వెల్లడించారు.
వేసివి కాలం వస్తున్న నేపథ్యంలో అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉండడం వల్ల అప్రమత్తంగా ఉన్నామని డీజీ విక్రమ్ సింగ్ వెల్లడించారు. కాగా, నాంపల్లి (Nampally) లోని తెలంగాణ ఎఫ్ఎస్ఎల్ (FSL)కార్యాలయంలో ఉన్న ల్యాబ్ లో శనివారం మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన సిబ్బంది వెంటనే బయటకు పరుగులు తీయడంతో ప్రాణ నష్టం తప్పినట్లయింది. అయితే, ఇదే భవనంలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన కీలక ఫైళ్లు ఉన్నట్లు సమాచారం.
Read Also: KCRపై చర్యలు తీసుకోకుంటే సీఎం రాజీనామా చేయాలి: కిషన్ రెడ్డి
Follow Us On : WhatsApp


