కలం, వెబ్ డెస్క్: ఛత్తీస్ఘడ్(Chhattisgarh) అడవులు మరోసారి కాల్పుల మోతతో దద్దరిల్లాయి. శుక్రవారం ఉదయం ఛత్తీస్గఢ్లోని అబూజ్మడ్ అడవుల్లో భారీ ఎన్ కౌంటర్(Encounter) జరిగింది. ఈ ఎన్ కౌంటర్లో 9 మంది మావోయిస్టులు మృతి చెందారు. భద్రతా దళాలు, మావోయిస్టుల మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు ఐదుగురి మృత దేహాలు లభ్యమైనట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఎన్ కౌంటర్ కు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.


