epaper
Wednesday, February 18, 2026
epaper

స్మృతి మంధాన కెప్టెన్సీలో మరో టైటిల్ నెగ్గిన ఆర్సీబీ

కలం, వెబ్ డెస్క్ : ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ 2026 (WPL 2026) సీజన్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఉమెన్స్  టీం(RCB Women team) చారిత్రాత్మక విజయం సాధించింది. ఢిల్లీ క్యాపిటల్స్‌ (Delhi Capitals) తో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించి, WPL టైటిల్‌ను రెండోసారి కైవసం చేసుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ నిర్ణీత ఓవర్లలో భారీ స్కోరు నమోదు చేసి బెంగళూరుకు భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. అయితే లక్ష్యం ఎంత పెద్దదైనా, బెంగళూరు బ్యాటర్లు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకుండా ఆత్మవిశ్వాసంతో ఎంతో అద్భుతంగా ఆడారు.

కెప్టెన్ స్మృతి మంధాన (Smriti Mandhana) నాయకత్వంలో  ఆర్సీబీ  ఇన్నింగ్స్ అద్భుతంగా సాగింది. టాప్ ఆర్డర్ బ్యాటర్లు నిలకడగా ఆడి జట్టును విజయదిశగా నడిపించారు. చివరికి ఓవర్‌లు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని చేరుకుని బెంగళూరు విజేతగా నిలిచింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మరోసారి టైటిల్ కైవసం చేసుకుంది. అలాగే ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఇది వరుసగా నాలుగో ఫైనల్ ఓటమిగా మిగిలింది. స్మృతి మంధాన కెప్టెన్సీలో మరోసారి టైటిల్ నెగ్గడంతో అభిమానులు, క్రికెట్ విశ్లేషకులు బెంగళూరు జట్టు ప్రదర్శనపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

Read Also: టీ20 వరల్డ్‌కప్‌లో రికార్డులు బద్దలు కావొచ్చు: హ్యారీ బ్రూక్

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>