కలం, వెబ్ డెస్క్: ఏపీ మంత్రి నారాయణ(Minister Narayana) లండన్ పర్యటన బుధవారం ఉదయంతో ముగిసింది. రెండు రోజుల పాటు నారాయణ బృందం లండన్(London)లో పర్యటించారు. అమరావతిలో నిర్మించనున్న అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణం కోసం లండన్లోని పలు స్టేడియంలను నారాయణ బృందం పరిశీలించింది. లండన్ స్టేడియం, లండన్ ఆక్వాటిక్స్ సెంటర్, హెడ్ పార్క్, లీ వ్యాలీ, వేలో పార్క్లను సందర్శించి అధ్యయనం చేశారు. రెండు రోజుల లండన్ పర్యటన ముగించుకొని మంత్రి నారాయణ అధికారులతో కలిసి ఖతార్(Qatar) బయలుదేరారు.


