epaper
Wednesday, February 18, 2026
epaper

హనుమకొండ కాకతీయ జూ పార్క్​ లో వైట్ టైగర్ మృతి..

కలం, వరంగల్ బ్యూరో : హనుమకొండ హంటర్ రోడ్డు కాకతీయ జూలాజికల్ పార్క్ (Hanumakonda Zoo) లోని వైట్ టైగర్ (శరణ్) మంగళవారం తెల్లవారుజామున మృతి చెందింది. వృద్ధాప్యం, మల్టీ ఆర్గాన్ ఫెల్యూర్ కారణంగా చనిపోయిందని జూ అధికారులు చెబుతున్నారు. మంగళవారం పులి అంత్యక్రియలు చేసినట్లు జూ పార్క్ పర్యవేక్షణ అధికారి మయూరి తెలిపారు. అయితే అధికారుల మెంటనెన్స్ సరిగా లేకనే రెండు రోజులుగా అనారోగ్యానికి గురై చనిపోయినట్లు తెలుస్తోంది. గత ఏడాది హైదరాబాద్ జూ పార్క్ నుంచి తెల్ల పులిని వరంగల్‌ కు తీసుకొచ్చారు. పులి సంరక్షణ సరిగా లేకనే అనారోగ్యానికి గురై మృత్యు వాత పడినట్లు సమాచారం.

 

 

 

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>