epaper
Tuesday, November 18, 2025
epaper

కుప్పంలో రూ.586కోట్లతో అల్యూమినియం ప్లాంట్

ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతోందని మంత్రి నారా లోకేష్(Nara Lokesh) అన్నారు. దిగ్గజ సంస్థలు సైతం ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయన్నారు. వీటిలో భాగంగానే ప్రఖ్యాత ఆదిత్య బిర్లా గ్రూప్‌కు చెందిన మెటల్స్ దిగ్గజం హిండాల్కో(Hindalco) ఇండస్ట్రీస్, చిత్తూరు జిల్లా కుప్పం(Kuppam)లో రూ. 586 కోట్ల భారీ పెట్టుబడితో అత్యాధునిక అల్యూమినియం ఎక్స్‌ట్రూజన్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయనుందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక విధానాల్లోని స్పష్టత, పనుల అమలులో వేగమే ఈ పెట్టుబడికి కారణమని పేర్కొన్నారు. ఏపీకి వస్తున్న ప్రధాన పెట్టుబడుల గురించి వివరిస్తూ లోకేష్ తన ఎక్స్(ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు. ‘‘ఆదిత్య బిర్లా గ్రూప్ నుంచి గ్లోబల్ మెటల్స్ లీడర్ అయిన హిండాల్కోకు ఆంధ్రప్రదేశ్ గర్వంగా స్వాగతం పలుకుతోంది. కుప్పంలో రూ. 586 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ఈ ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా 613 మందికి, పరోక్షంగా మరెందరికో ఉపాధి లభిస్తుంది” అని ఆయన పేర్కొన్నారు.

ఈ యూనిట్‌లో ఐఫోన్ ఛాసిస్ కోసం అవసరమైన అత్యున్నత నాణ్యత కలిగిన అల్యూమినియంను తయారు చేస్తారని, తద్వారా యాపిల్ గ్లోబల్ సప్లై చైన్‌లో ఆంధ్రప్రదేశ్ ఒక ముఖ్యమైన భాగంగా మారుతుందని వివరించారు. 2027 మార్చి నాటికి వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 2025-30 ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చరింగ్ పాలసీ విజయానికి హిండాల్కో పెట్టుబడే నిదర్శనమని లోకేష్ అన్నారు.

హిండాల్కో ఏపీని ఎంచుకోవడానికి ప్రధాన కారణాలు మా ముందు చూపుతో కూడిన విధానాలు, బెంగళూరుకు 120 కిలోమీటర్లు, చెన్నైకి 200 కిలోమీటర్ల దూరంలో కుప్పం వ్యూహాత్మకంగా ఉండటం, పునరుత్పాదక ఇంధన వనరులు అందుబాటులో ఉండటం” అని ఆయన పేర్కొన్నారు. ఈ పెట్టుబడితో కుప్పం ప్రాంతం స్మార్ట్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్స్ తయారీకి నమ్మకమైన ప్రత్యామ్నాయ కేంద్రంగా మారుతుందని ఆయన(Nara Lokesh) విశ్వాసం వ్యక్తం చేశారు.

Read Also: పదేళ్లలో ఇండియా అభివృద్ధి అనూహ్యం: లోకేష్

Follow Us on: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>