epaper
Friday, January 16, 2026
spot_img
epaper

ఆస్ట్రేలియాపై అదరగొట్టిన అభిషేక్.. రికార్డ్ బ్రేక్

ఆస్ట్రేలియాతో జరిగిన ఐదో టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మ(Abhishek Sharma) కొత్త రికార్డ్ సృష్టించాడు. టీ20 ఫార్మాట్‌లో అతి తక్కువ బంతుల్లో వెయ్యి పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో స్థానం సంపాదించుకున్నాడు. ఈ మ్యాచ్‌లో 11 పరుగుల వ్యక్తిగత స్కోర్ దగ్గర అభిషేక్ ఈ ఫీట్ సాధించాడు. వెయ్యి పరుగుల మైలురాయిని అందుకోవడానికి అతడు తీసుకున్న బంతులు 528. దీంతో అతితక్కువ బంతుల్లో 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా అభిషేక్ నిలిచాడు. అంతేకాకుండా అతి తక్కువ మ్యాచ్‌లలో ఈ మైలురాయిని అధిగమించిన రెండో ఇండియా బ్యాటర్‌గా కూడా అభిషేక్ రికార్డ్ చేశాడు.

అతి తక్కువ బంతుల్లో అంతర్జాతీయ టీ20లలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న ఆటగాళ్లు
అభిషేక్‌ శర్మ(Abhishek Sharma)- 528 బంతుల్లో
సూర్యకుమార్‌ యాదవ్‌- 573 బంతుల్లో
ఫిల్‌ సాల్ట్‌- 599 బంతుల్లో
గ్లెన్‌ మాక్స్‌వెల్‌- 604 బంతుల్లో
ఆండ్రీ రసెల్‌, ఫిన్‌ అలెన్‌- 609 బంతుల్లో.

తక్కువ ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ టీ20లలో వెయ్యి పరుగులు పూర్తి చేసుకున్న భారత బ్యాటర్లు
విరాట్‌ కోహ్లి- 27 ఇన్నింగ్స్‌లలో
అభిషేక్‌ శర్మ- 28 ఇన్నింగ్స్‌లలో
కేఎల్‌ రాహుల్‌- 29 ఇన్నింగ్స్‌లలో
సూర్యకుమార్‌ యాదవ్‌- 31 ఇన్నింగ్స్‌లలో
రోహిత్‌ శర్మ- 40 ఇన్నింగ్స్‌లలో.

Read Also: ఆసియా కప్ ట్రోఫీ కోసం రంగంలోకి ఐసీసీ..

Follow Us on : Pinterest

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>