epaper
Friday, January 23, 2026
spot_img
epaper

కేటీఆర్, హరీశ్​రావుపై డీజీపీకి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఫిర్యాదు

కలం, వెబ్​డెస్క్​: బీఆర్​ఎస్​ ఎమ్మెల్యేలు కేటీఆర్​, హరీశ్​రావుపై డీజీపీకి కాంగ్రెస్​ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​ (Balmuri Venkat) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు శుక్రవారం డీజీపీ శివధర్​ రెడ్డిని కలసి రాతపూర్వకంగా ఫిర్యాదు అందించారు. ఫోన్​ ట్యాపింగ్ ​(Phone Tapping) కేసు విచారణ సందర్భంగా హరీశ్​రావు, కేటీఆర్​​ అధికారులను బెదిరించేలా, భయభ్రాంతులకు గురిచేసేలా మాట్లాడారని బల్మూరి ఫిర్యాదులో పేర్కొన్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.

కాగా, ఫోన్​ ట్యాపింగ్​ (Phone Tapping) కేసులో రెండ్రోజుల కిందట హరీశ్​రావును సిట్​ అధికారులు విచారించారు. అలాగే నేడు కేటీఆర్​ను విచారణకు పిలిచారు. ఈ క్రమంలో వీరు విచారణ అధికారులను భయపెట్టేలా మాట్లాడారని బల్మూరి ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు, విచారణ క్రమంలో కేటీఆర్​, హరీశ్​రావు సిట్​ బృందాన్ని, పోలీసుల తీరును ప్రశ్నిస్తూ అనేక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ‘అధికారులు ఎక్కడున్నా వదిలిపెట్టం.. సప్త సముద్రాలు దాటినా లాగుతాం.. రిటైర్మెంట్​కు దగ్గరున్న అధికారులతో సిట్​ బృందాన్ని ఏర్పాటు చేసినా, రెండేళ్ల తర్వాత వచ్చే బీఆర్​ఎస్​ ప్రభుత్వం వాళ్లను వదలదు.. అధికారులు సీఎం రేవంత్​రెడ్డికి తొత్తుగా మారారు’ అంటూ ఘాటు హెచ్చరికలు సైతం జారీ చేశారు. ఈ క్రమంలో సిట్​ అధికారులతోపాటు సీపీ సజ్జనార్​నూ కేటీఆర్​, హరీశ్​రావు బెదిరించేలా మాట్లాడారంటూ డీజీపీ శివధర్​ రెడ్డికి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్​ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>