epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

క్రెడిట్​ కార్డ్​ వడ్డీ రేట్లు తగ్గించాలి.. కేంద్ర మంత్రికి పురంధేశ్వరి విజ్ఞప్తి

కలం, వెబ్​డెస్క్​: దేశంలో క్రెడిట్​ కార్డు (Credit Card) సంస్థలు విధిస్తున్న వడ్డీ రేట్లను, పెనాల్టీ చార్జీలను తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్​కు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి (Purandeswari ) విజ్క్షప్తి చేశారు. ఈ మేరకు గురువారం కేంద్ర మంత్రికి వినతి పత్రం అందజేశారు. ‘దేశంలో క్రెడిట్​ కార్డ్​ సంస్థలు వినియోగదారులపై విధిస్తున్న వార్షిక వడ్డీ రేట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. 24శాతం నుంచి 48శాతం వరకు వడ్డీ రేట్లు రాబడుతున్నాయి. కొన్నైతే ఏకంగా 55.55శాతం వరకు విధిస్తున్నాయి. ఈ రేట్లు వినియోగదారులకు భారంగా ఉన్నాయి. వీటిని తగ్గించాలి’ అని వినతి పత్రంలో కేంద్ర మంత్రికి పురంధేశ్వరి నివేదించారు.

అమెరికాలో అధ్యక్షుడు డొనాల్డ్​ ట్రంప్​ క్రెడిట్​ కార్డ్​ల వడ్డీ, పెనాల్టీ ఛార్జీలను తగ్గిస్తూ విధించిన క్యాపింగ్​ను లేఖలో పురంధేశ్వరి (Purandeswari) ప్రస్తావించారు. అమెరికాలో ఏకంగా 10శాతం తగ్గించారని నిర్మల దృష్టికి తీసుకెళ్లారు. మన దేశంలో ఆర్​బీఐ ఇప్పటికే క్రెడిట్​ కార్డ్​ వడ్డీరేట్లు, పెనాల్టీ ఛార్జీల తగ్గింపుపై కొన్ని గైడ్​లైన్స్​ జారీ చేసిందన్నారు. క్రెడిట్ కార్డ్​ సంస్థలు వడ్డీ రేట్లను ఎక్కువగా విధించడంలో పారదర్శకత లేదని పేర్కొన్నారు. కొన్ని కంపెనీలు ఈ అవకాశాన్ని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నాయని వివరించారు. క్రెడిట్​ కార్డుల అధిక వడ్డీ రేట్లు, పెనాల్టీ ఛార్జీల నుంచి వినియోగదారులను రక్షించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆ లేఖలో కేంద్ర మంత్రిని పురంధేశ్వరి కోరారు.

Read Also: ఎన్ని పాదయాత్రలు చేసినా జగన్​ అధికారంలోకి రాడు: విజయసాయి

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>