epaper
Thursday, January 22, 2026
spot_img
epaper

ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగం చదవని కర్ణాటక గవర్నర్​!

కలం, వెబ్​డెస్క్​: దక్షిణాదిలో ప్రభుత్వాలకు, గవర్నర్​లకు మధ్య వివాదాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే కేరళ, తమిళనాడు అసెంబ్లీల్లో ఆ రాష్ట్ర గవర్నర్​ల తీరు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే తీరు కర్ణాటక విధానసభలోనూ చోటుచేసుకుంది. ​సమావేశాల సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన ప్రసంగాన్ని గవర్నర్​ థావర్​ చంద్​ గహ్లోత్ (Thawar Chand Gehlot)​ చదవలేదు. అంతేకాదు, ‘ ఈ రాష్ట్రం ప్రగతి మార్గంలో నడుస్తోంది. సమావేశాలు విజయవంతం కావాలని ఆశిస్తున్నా’ అంటూ రెండే వాక్యాలు మాట్లాడి సభ నుంచి వెళ్లిపోయారు.

దీనిపై కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య (Siddaramaiah) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది రాజ్యాంగ విరుద్ధ చర్య అంటూ మండిపడ్డారు. కాంగ్రెస్​ పార్టీ సైతం గవర్నర్​ తీరును ఆక్షేపించింది. కాగా, మహాత్మాగాంధీ ఉపాధి హామీ చట్టం పేరును వీబీ జీ రామ్​ జీగా మార్చడం, చట్టంలో సవరణలు చేయడం వ్యతిరేకిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ప్రసంగంలో పొందుపర్చింది. దీనిని చదవాల్సి వస్తుందనే గవర్నర్​ ఇలా చేశారని కాంగ్రెస్​ మండిపడింది. గవర్నర్ తీరును నిరసిస్తూ కాంగ్రెస్​ సభ్యులు సభలో ఆందోళనకు దిగారు.

మరోవైపు ఇదే తరహాలో కేరళలోనూ ఆ రాష్ట్ర గవర్నర్​ వ్యవహరించిన తీరు తెలిసిందే. అక్కడ కూడా వీబీ జీ రామ్​ జీ చట్టం పేరుతో చేసిన సవరణలను వ్యతిరేకిస్తూ ఉన్న అంశాలను ఆ రాష్ట్ర గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్​ అర్లేకర్​ ​చదవలేదు. ఇక, తమిళనాడులో అసెంబ్లీలో జాతీయ గీతం పాడలేదంటూ ఆ రాష్ట్ర గవర్నర్​ ఆర్​.ఎన్​.రవి అర్ధాంతరంగా సభ నుంచి వెళ్లిపోవడం కలకలం రేపింది. ఈ మూడు రాష్ట్రాల్లోనూ ప్రతిపక్షాలు అధికారంలో ఉండడంతో.. కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్​డీఏ ప్రభుత్వం ఉద్ధేశ్యపూర్వకంగా గవర్నర్ల ద్వారా ఇలాంటి పనులు చేయిస్తోందని ఆ రాష్ట్ర ప్రభుత్వాలు మండిపడుతున్నాయి.

Thawar Chand Gehlot
Thawar Chand Gehlot

Read Also:  గ్రాషా మేషల్​కు ఇందిరా గాంధీ శాంతి బహుమతి

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>