epaper
Tuesday, January 20, 2026
spot_img
epaper

మున్సిపల్​ ఎన్నికల్లో జాగృతి పోటీ..! ఆశావహులతో కవిత భేటీ

కలం, వెబ్​ డెస్క్​ : తెలంగాణ జాగృతి (Telangana Jagruthi) మున్సిపల్​ ఎన్నికల బరిలోకి దిగడానికి సన్నాహాలు చేస్తోంది. నిజామాబాద్​ లో పోటీపై జాగృతి అధ్యక్షురాలు కవిత (Kavitha) ఆశావహులతో హైదరాబాద్​ లోని తన నివాసంలో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో 20 నుంచి 30 మంది అభ్యర్థులను బరిలోకి దించేందుకు చర్చించినట్లు సమాచారం. బీఆర్​ఎస్​ నుంచి బయటకు వచ్చిన తరువాత జరుగుతున్న తొలి ఎన్నిక కావడంతో జాగృతి బరిలోకి దిగాలని చూస్తోంది. ఈ మేరకు నిజామాబాద్​ మున్సిపల్​ ఎన్నికల్లో సింహం గుర్తుతో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సమాచారం. జాగృతిని రాజకీయ పార్టీగా మార్చడానికి ముందే అభ్యర్థుల పేర్లను ప్రకటించేందుకు కవిత సన్నాహాలు చేస్తున్నట్లు చర్చ నడుస్తోంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>