epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

సీఎం రేవంత్ ఖమ్మం జిల్లా పర్యటన ఖరారు ?

కలం, ఖమ్మం బ్యూరో: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఖమ్మం జిల్లా పర్యటన ఖరారైంది. ఈ నెల 18వ తేదీన ఆయన జిల్లాలోని పాలేరు నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా పాలేరులో వంద పడకల ఆసుపత్రి, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల, నర్సింగ్ కళాశాల నిర్మాణ పనులకు ముఖ్యమంత్రి శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం మద్దులపల్లి మార్కెట్ యార్డును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు.

రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మద్దులపల్లిలో భారీ బహిరంగ సభను నిర్వహించేందుకు ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ సభకు భారీగా జన సమీకరణ చేసేలా రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి (Minister Ponguleti) ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. పాలేరు పర్యటన ముగించుకుని సీఎం రేవంత్ రెడ్డి ఖమ్మం చేరుకుంటారు. అక్కడ నిర్వహించనున్న సీపీఐ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. సీఎం రేవంత్ (Revanth Reddy) రాకను పురస్కరించుకుని జిల్లా యంత్రాంగం ఇప్పటికే ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమైంది.

ముఖ్యమంత్రి ఖమ్మం జిల్లాలో పర్యటించనున్న సందర్భంగా మద్దులపల్లి జెఎన్టీయూ ప్రాంతంలో ఏర్పాట్లను అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస రెడ్డి, సంబంధిత అధికారులతో కలిసి మంగళవారం సాయంత్రం పరిశీలించారు. ప్రోటోకాల్, శంకుస్థాపన పనులు, హెలిప్యాడ్ స్థలం, ఇతర ఏర్పాట్లపై సంబంధిత అధికారులతో చర్చించి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మద్దులపల్లి మార్కెట్ కమిటీ చైర్మన్ హరినాథ్ బాబు, జిల్లా మార్కెటింగ్ శాఖ అధికారి ఎం.ఏ. అలీమ్, ఆర్ అండ్ బీ, ఇరిగేషన్, పోలీస్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Read Also: ఏఐ హెల్మెట్.. ట్రాఫిక్​ రూల్స్​ బ్రేక్​ చేస్తే అంతే!

Follow Us On: X(Twitter)

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>