కలం, వెబ్ డెస్క్ : ఖమ్మం పట్టణంలో జరగబోయే సిపిఐ (CPI) శతాబ్ది ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) హాజరు కానున్నట్లు తెలుస్తోంది. భారత కమ్యూనిస్టు పార్టీ శతాబ్ది ఉత్సవాల ముగింపు సందర్భంగా జనవరి 18న జరిగే బహిరంగ సభకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరుకానున్నారు. మధ్యాహ్నం రెండు గంటలకు ఖమ్మం పట్టణంలో ఎస్ఆర్అండ్ బీజిఎన్ఆర్ (SR & BGNR) కళాశాల మైదానంలో జరిగే బహిరంగ సభలో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు.
Read Also: రేవంత్ రెడ్డికి మూటలు మోసుడు తప్ప ఏం తెల్వదు : కేటీఆర్
Follow Us On: Youtube


