epaper
Thursday, January 15, 2026
spot_img
epaper

బీఆర్​ఎస్​కు రైతుల కంటే రాజకీయాలే ముఖ్యం : మంత్రి జూపల్లి

కలం, వెబ్​ డెస్క్​ : బీఆర్ఎస్​ పార్టీకి తెలంగాణ రైతుల ప్రయోజనాల కంటే రాజకీయాలే ముఖ్యమని ఎక్సైజ్​, టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు (Minister Jupally ) అన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మాజీ మంత్రి హరీశ్​ రావుపై తీవ్రంగా మండిపడ్డారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు 299 టీఎంసీలు, ఏపీకి 512 టీఎంసీలు అని ఎందుకు ఒప్పుకున్నారో సమాధానం చెప్పాలన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వం కృష్ణా జలాలను ఏపీకి దోచి పెడుతున్నదని కేసీఆర్​ అన్నారని.. తోలు తీస్తా అని కూడా కేసీఆర్​ అన్నాడని మంత్రి జూపల్లి గుర్తు చేశారు.

అయితే, వాస్తవ పరిస్తితులు తెలంగాణ ప్రజలకు తెలియాలని అసెంబ్లీ చర్చ పెడితే.. సభకు బీఆర్​ఎస్​ ఎందుకు రాలేదని ప్రశ్నించారు. వాళ్ల అవినీతి బండారం బయటపడుతుందనే భయంతో అసెంబ్లీ సమావేశాలకు బాయ్ కాట్​ చేశారని విమర్శించారు. గత బీఆర్​ ఎస్​ ప్రభుత్వం రైతులకు నీళ్లందించడం కంటే కమీషన్లు తీసుకునేందుకే అదిక ప్రాధాన్యం ఇచ్చిందని ఆయన ఆరోపించారు. కమీషన్ల మీద పెట్టిన శ్రద్ధ ప్రాజెక్టుల మీద పెట్టలేదని దుయ్యబట్టారు. కాళేశ్వరం, మల్లన్నసాగర్​, కొండపోచమ్మ సాగర్​ మీద చూపిన ప్రేమ.. ఉమ్మడి పాలమూరు ప్రాజెక్టులపై చూపలేదని మంత్రి (Minister Jupally) ఆగ్రహం వ్యక్తం చేశారు.

Read Also:  నల్లమలసాగర్ ప్రాజెక్టుపై లాయర్లతో చర్చలు

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>