కలం, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం (NDA) వచ్చాక లోకేష్ గ్రాఫ్ అమాంతం పెరిగింది.. విద్యా శాఖ మంత్రిగా, ఐటి శాఖా మంత్రిగా లోకేష్ (Nara Lokesh) అద్భుతంగా పని చేస్తూ దూసుకుపోతున్నారు..ఇదిలా వుంటే ఈ న్యూ ఇయర్ సందర్భంగా లోకేష్ చేసిన ట్వీట్ ప్రస్తుతం బాగా వైరల్ అవుతుంది..2025 సంవత్సరం తనకి ఎన్నో జ్ఞాపకాలను మిగిల్చింది అని లోకేష్ ట్వీట్ చేశారు.
ప్రధాని మోదీ నుంచి ప్రశంసలు అందుకోవడం తనకు ఎంతో ప్రత్యేకమని లోకేష్ పేర్కొన్నారు.. అలాగే ప్రభుత్వ పాఠశాలలో ప్రతి శనివారం నో బ్యాగ్ డే అమలు, మెగా డీఎస్సి పూర్తి చేయడం వంటి పలు విద్యా శాఖా సంస్కరణలు పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు. ‘మన మిత్ర’ద్వారా వాట్సప్ సేవలు తీసుకురావడం, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ తో భేటీ వంటి జ్ఞాపకాలు తనకి ఎంతో ఆనందాన్ని కలిగించాయి అని లోకేష్ (Nara Lokesh) ట్వీట్ చేశారు.
Read Also: కేసీఆర్ కు నచ్చితే ఎంత.. నచ్చకుంటే ఎంత : మంత్రి ఆనం
Follow Us On: Sharechat


