కలం, మునుగోడు : తెలంగాణ ప్రజాపాలన దినోత్సవాన్ని (Praja Palana Day) పురస్కరించుకుని చండూరు మండల పరిధిలోని నేర్మట గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ సర్పంచ్ నారపాక వసంత ధనయ్య జెండా ఆవిష్కరించి అమరవీరులను స్మరించుకున్నారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి పి.వెంకన్న. వార్డు సభ్యులు నారపాక దశరథ, బురకల వసంత, బలెం, కవిత స్వామి, బండమీది వెంకటయ్య, జెర్రిపోతుల ధనంజయ, ప్రధానోపాధ్యాయులు మధుమోహన్,కారోబార్ యాదయ్య, పంచాయతీ సిబ్బంది ఈరటి శ్రీశైలం, నాగిళ్ల లక్ష్మయ్య, చంద్రకళ, మల్లయ్య, లక్ష్మమ్మ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

