epaper
Friday, January 16, 2026
spot_img
epaper

జానారెడ్డికి సీఎం రేవంత్ రెడ్డి​ పరామర్శ

కలం, వెబ్​ డెస్క్​ : కాంగ్రెస్​ సీనియర్​ నేత, మాజీ మంత్రి కందూరు జానారెడ్డి (Jana Reddy) ని ముఖ్యమంత్రి రేవంత్​ రెడ్డి (Revanth Reddy) పరామర్శించారు. ఇటీవల ఆయనకు మోకాలి ఆపరేషన్​ అయింది. దీంతో ఇంటి వద్దే విశ్రాంతి తీసుకుంటున్నారు. విషయం తెలుసుకున్న సీఎం రేవంత్ రెడ్డి.. జానారెడ్డి నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఇరువురు రాష్ట్ర రాజకీయాలపై కాసేపు చర్చించినట్లు సమాచారం. శాసనసభ సమావేశాల వేళ జానారెడ్డి, సీఎం రేవంత్​ రెడ్డి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>