కలం, వలిగొండ: వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమ నేత జిట్టా బాలకృష్ణారెడ్డి (Jitta Balakrishna Reddy) రెండవ వర్ధంతిని ఆదివారం జిట్ట అభిమానుల ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు సమర్పించి ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమాన్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు పరిచయం చేసి భువనగిరి నియోజకవర్గంలో ఉద్యమాన్ని ఉర్రూతలూగించిన గొప్ప వ్యక్తి అని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, జిట్ట అభిమానులు పాల్గొన్నారు.

