కలం, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలుపు మేరకు, ఆయన దిశానిర్దేశంలోనే ఎర్రవెల్లి నివాసంలో జరుగుతున్న బీఆర్ఎస్ శాసన సభా పక్ష సమావేశానికి హాజరయ్యానని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (Gudem Mahipal Reddy) స్పష్టం చేశారు.
తాను కాంగ్రెస్ పార్టీలో చేరలేదని ఇప్పటికే కోర్టు తీర్పు వచ్చిందని, అందువల్ల తన రాజకీయ స్థితిపై ఎవరికీ ఎలాంటి సందేహాలు అవసరం లేదని ఆయన తెలిపారు. రాబోయే అసెంబ్లీ సమావేశాల్లో తాను బీఆర్ఎస్ పార్టీ వైపే, ప్రతిపక్ష వరుసలోనే కూర్చుంటానని మహిపాల్ రెడ్డి చెప్పారు.

