కలం, యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే (Bhupalpally MLA) గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో ఆలయ వేద పండితులు, మూర్తి అర్చక బృందం వేదాశీర్వచనం అందిచారు. తర్వాత ఆలయ ఏఈఓ దొమ్మాట సురేందర్ రెడ్డి ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
Also Read : హైవే బాధితులకు ‘గోల్డెన్’ అభయం.. నకిరేకల్లో ‘100 పడకల’ సంజీవని!
Follow Us On: Youtube

