కలం యాదగిరిగుట్ట : యాదాద్రి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని భూపాలపల్లి ఎమ్మెల్యే (Bhupalpally MLA) గండ్ర సత్యనారాయణ రావు (Gandra Satyanarayana Rao) దర్శించుకున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆలయంలోని ఆశీర్వాద మండపంలో ఆలయ వేద పండితులు, మూర్తి అర్చక బృందం వేదాశీర్వచనం అందిచారు. తర్వాత ఆలయ ఏఈఓ దొమ్మాట సురేందర్ రెడ్డి ఎమ్మెల్యేకు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.

