కలం, వెబ్డెస్క్: బంగ్లాదేశ్ ఛాందసవాద మూకలతో సంబంధాలున్న 11 మంది జిహాదీ ఉగ్రవాదుల (Jihadists arrested) ను అరెస్ట్ చేశారు. ఈశాన్య రాష్ట్రాలను అస్థిరపరచాలనే లక్ష్యంతో వీళ్లంతా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం గువాహటిలో నగర పోలీస్ కమిషనర్ పీఎస్ మహంతా వివరాలు వెల్లడించారు. నిఘా సంస్థలు ఇచ్చిన సమాచార ఆధారంగా స్పెషల్ టాస్క్ ఫోర్స్(ఎస్టీఎఫ్) బృందం అస్సాం, త్రిపురలో 11 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. ‘సోమవారం రాత్రి అస్సాంలోని బార్పెటా, చిరంగ్, బక్సా, డరాంగ్తోపాటు త్రిపురలోని మరికొన్ని ప్రాంతాల్లో ఎస్టీఎఫ్ దాడులు చేసింది.
11 మంది జిహాదీ ఉగ్రవాదుల (Jihadists arrested) ను అరెస్టు చేసింది. వీరంతా ఇమామ్ మహ్మదుర్ కఫిలా(ఐఎంకే) మ్యాడ్యుల్ సభ్యులు. బంగ్లాదేశ్ కేంద్రంగా పనిచేస్తున్న జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) గ్రూపు ఆదేశాలతో పనిచేస్తున్నారు. వీరి వద్ద ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన పుస్తకాలు, ఆయుధాలు దొరికాయి. ఈశాన్య రాష్ట్రాలను అస్థిరపరచడమే లక్ష్యంగా వీళ్లు పనిచేస్తున్నారు’ అని ఆయన వెల్లడించారు. కాగా, ఉగ్రవాద కార్యాకలాపాలకు పాడుతున్న జేఎంబీని భారత్ చాలా ఏళ్ల కిందటే నిషేధించింది.
Read Also: ‘సర్’ పెద్ద స్కామ్.. ఒక్క ఓటు గల్లంతైనా ఈసీ ముట్టడి : మమత
Follow Us On : WhatsApp


