కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా ఉట్నూర్ (Utnoor) మండలంలోని వివిధ గ్రామాలకు చెందిన పలువురు నేతలు ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ (MLA Vedma Bhojju Patel) సమక్షంలో సోమవారం కాంగ్రెస్ పార్టీలో (Congress Joining) చేరారు. జెండాగూడకు చెందిన భగవంత్ రావు పటేల్, చెరువుగూడకు చెందిన మారు పటేల్, మొర్రిపేటకు చెందిన మాణిక్ రావు జెలపాత్, దంతలపల్లి గ్రామపంచాయతీకి చెందిన సుభాష్తో పాటు పలువురు కాంగ్రెస్లో చేరారు.
ఈ సందర్భంగా ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ వారికి కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

