కలం, నిర్మల్: సోన్ మండలం (Soan Mandal ) కడ్తాల్ గ్రామంలో ఆదివారం ఉదయం పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్ నుంచి ఆదిలాబాద్ వైపు వెళ్తున్న బొలెరో వాహనం 44వ జాతీయ రహదారి నుంచి కడ్తాల్ గ్రామంలోని సర్వీస్ రోడ్డుపైకి అదుపుతప్పి బోల్తాపడి విద్యుత్ స్తంభాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 11 కేవీ విద్యుత్ స్తంభం ధ్వంసమైంది. బొలెరో వాహనం టైరు ఊడిపోయి ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో దాని వెనుక భాగం కూడా దెబ్బతిన్నది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని వాహనం ఢీకొట్టిన విషయం తెలుసుకున్న విద్యుత్ అధికారులు వెంటనే అప్రమత్తమై విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది.

