కలం, హనుమకొండ: హనుమకొండ జిల్లా కమలాపూర్ పోలీస్ స్టేషన్ (Kamalapur Police Station) ఆవరణలో మంగళవారం ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. స్థానికుల వివరాల ప్రకారం, కమలాపూర్కు చెందిన అన్నదమ్ములు కంది రమేశ్, శ్రీనివాస్ మధ్య జరిగిన గొడవలో శ్రీనివాస్ కుటుంబ సభ్యులకు గాయాలయ్యాయి. ఈ ఘటనపై విచారణ నిమిత్తం పోలీసులు రమేశ్తో పాటు అతని కుమారుడిని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో రమేశ్ భార్య కంది శృతి రాత్రి పోలీస్ స్టేషన్కు చేరుకుని ఓ రసాయనం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వెంటనే అప్రమత్తమైన పోలీసులు 108 అంబులెన్స్లో ఆమెను చికిత్స నిమిత్తం ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. ఘటనపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు.

