ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామా.. బీజేపీ ఎంపీ కూతురు సంబరాలు

కలం, వెబ్​ డెస్క్​ : కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ రాజీనామాపై దేశవ్యాప్తంగా విద్యార్థులు, జెన్​ జీ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో బీజేపీ ఎంపీ కూతురు ఈ సంబరాల్లో భాగం అవడం ఆసక్తికరంగా మారింది. భువనేశ్వర్ ఎంపీ అపరాజిత సారంగి (Aparajita Sarangi) కుమార్తె అర్చిత సచిన్ రహార్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్​ చర్చనీయాంశంగా మారింది.

ఎంపీ కూతూరు అర్చిత ధర్మేంద్ర ప్రధాన్ ఫోటోతో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో “నీట్ (NEET) పేపర్ లీక్ వ్యవహారంపై విద్యార్థుల భారీ నిరసనల మధ్య ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు” అని రాసుకొచ్చారు. అలాగే, “తన మునుపటి పోస్ట్​ ని తొలగించమని మా అమ్మకు చెప్పబోయే డీపీ (DP) పీఏకు ఒక మాట చెబుతున్నాను. శ్రమ పడకండి నేను ఈ స్టోరీని తొలగించను. జై జగన్నాథ్​.. జై హింద్​” అని మరో పోస్ట్ లో రాసుకొచ్చారు.

స్వయానా బీజేపీ ఎంపీ కూతురే ఈ విధంగా పార్టీ ప్రతిష్ఠను దెబ్బతిసేలా పోస్ట్​ చేయడంపై ఆ పార్టీ నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ప్రతి ఒక్కరికీ తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉంటుందని బీజేపీ ఎంపీ కార్యాలయం వెల్లడించింది. రహార్ సోషల్​ మీడియా పోస్ట్ ఎంపీ అపరాజిత సారంగి వివాదాల్లోకి నెట్టింది.

Read Also: ప‌రీక్ష‌ల సంస్క‌ర‌ణ‌ల‌పై మోదీ కీల‌క ప్ర‌క‌ట‌న‌!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>