ఢిల్లీలో మళ్లీ హైటెన్షన్​.. రాజ్​ఘాట్ కు​ ఇండి కూటమి నేతలు

కలం, వెబ్​ డెస్క్​ : ఢిల్లీలో ఇండి కూటమి నేతల నిరసనలతో మరోసారి ఉద్రిక్తతలు చోటు చేసుకుంటున్నాయి. రాహుల్​ నివాసంలో భేటీ అయిన ఇండి కూటమి నేతలు కీలక చర్చలు జరిపారు. సమావేశం అనంతరం కూటమి నేతలు (INDI Alliance Protest) రాజ్ ఘాట్​ కు బయల్దేరారు. రాహుల్‌ నివాసం నుంచి రాజ్​ ఘాట్​ కు ర్యాలీగా బుస్సులో బయల్దేరి నీట్​ ప్రశ్నాపత్రం లీకేజీ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థులకు నివాళులు అర్పించేందుకు సిద్ధమయ్యారు. అలాగే, కొవ్వోత్తుల ర్యాలీ నిర్వహించనున్నారు. గాయపడిన విద్యార్థులకు అండగా ఉంటామని రాహుల్​ గాంధీ హామీనిచ్చారు. అలాగే, విద్యార్థుల డిమాండ్లకు తాము పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని చెప్పారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>