మున్సిపాలిటీలలో పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి: కలెక్టర్

కలం, నిర్మల్ : నిర్మల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్యానికి ప్రాధాన్యం ఇవ్వాలని జిల్లా కలెక్టర్ భవేశ్ మిశ్రా (Bhavesh Mishra) అధికారులను ఆదేశించారు మంగళవారం నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో మున్సిపాలిటీకి సంబంధించిన అంశాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలలో నిరంతరం మెరుగైన పారిశుద్ధ్య పనులు కొనసాగించాలని అన్నారు.

వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూడాలన్నారు. సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు ఘన వ్యర్థాల నిర్వహణ సక్రమంగా చేపట్టాలని తెలిపారు. ప్లాస్టిక్ నిషేధం పకడ్బందీగా అమలు చేయాలని అన్నారు. మౌలిక సదుపాయాల కల్పన పనులన్నీ వేగవంతంగా పూర్తి చేయాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ బి. వెంకటేశ్వర్లు, మున్సిపల్ కమిషనర్ లు రవి బాబు, సుందర్ సింగ్, యాదయ్య, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>