ఉమారాణి దినకర్మలో పాల్గొన్న శ్రీధర్ బాబు

కలం, రామగుండం: రామగుండం ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్(Raj Thakur) సోదరుడు ధర్మేందర్ సింగ్ సతీమణి ఉమారాణి ఇటీవల మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన దినకర్మ కార్యక్రమానికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu), ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణ రావు హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఉమారాణి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కాన్ సింగ్, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని భగవంతుడు ప్రసాదించాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రామగుండం మేయర్, డిప్యూటీ మేయర్, డీసీపీ, ఏసీపీ, పోలీసు అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, పలువురు ప్రముఖులు పాల్గొని ఉమారాణికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు తమ సానుభూతిని తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>