కలం, వెబ్ డెస్క్ : ప్రపంచం టెక్నాలజీ వినియోగంలో ఎన్నో ఘనతలు సాధించింది. అయినా కొందరు తీసుకుంటున్న నిర్ణయాలు, ఆచారాలు ఇప్పటికి ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి. రాజస్థాన్ లో జాలోర్ జిల్లా గాజీపూర్ గ్రామంలో సంచలన నిర్ణయం తీసుకున్నారు. 15 గ్రామాల్లో చౌదరి సమాజానికి చెందిన కోడళ్లు, యువతులు సెల్ ఫోన్ ల వాడకంపై కఠిన ఆంక్షలు (Smart Phone Ban) విధించారు. కెమెరా ఉన్న ఫోన్ల వినియోగాన్ని పూర్తిగా నిషేధించారు. జనవరి 26 నుంచి స్మార్ట్ ఫోన్ల వాడకాన్ని పూర్తిగా నిషేధిస్తూ, కేవలం కాల్స్ చేయడానికి మాత్రమే ఉపయోగించే కీప్యాడ్ ఫోన్ లను మాత్రమే అనుమతించాలని తీర్మానించారు.
అలాగే, కోడళ్లు.. యువతులు పెళ్లిల్లు, సామాజిక కార్యక్రమాలు, బహిరంగ వేడుకలు, బయటకు వెళ్లేటప్పుడు కూడా సెల్ ఫోన్లు తీసుకెళ్లడకూడదంటూ ఆంక్షలు జారీ చేశారు. స్మార్ట్ ఫోన్ల వినియోగం పూర్తిగా నిషేదం కాగా, కీ ప్యాడ్ ఫోన్ లతో కేవలం కాల్స్ చేయడానికి మాత్రమే అనుమతి ఉంది. అయితే, విద్య కోసం మొబైల్ అవసరం ఉన్న పాఠశాల విద్యార్థులకు కొంత సడలింపు ఇచ్చారు. వారు ఇంట్లో ఉన్నప్పుడు మాత్రమే ఫోన్ వాడొచ్చని, ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు తీసుకువెళ్లకూడదని పంచాయతీ స్పష్టం చేసింది.
మహిళలు మెబైల్ ఫోన్లను ఎక్కువగా వినియోగించడం వల్ల వారి కళ్లపై ప్రతి కూల ప్రభావం పడుతోందని గ్రామపెద్ద చెబుతన్నారు. అలాగే కొందరు మహిళలు ఇంటి పనులు సులభంగా పూర్తిచేసుకోవాడానికి తమ పిల్లలకు పోన్లు ఇస్తున్నారని, ఇది మంచిది కాదని అభిప్రాయపడ్డారు. మొబైల్ వినియోగం తగ్గిస్తే మంచి ఫలితాలు వస్తాయని పంచాయతీ పెద్దలు అంటున్నారు. కాగా, Smart Phone Ban నిర్ణయం తీవ్ర చర్చకు దారితీసింది. ఇది ఆడవాళ్ల స్వేచ్ఛ, హక్కులను హరించే విధంగా ఉన్నాయని తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
Read Also: ముంబైని కాపాడడానికే కలిశాం.. ఠాక్రే సోదరులు
Follow Us On: X(Twitter)


