సీఎం రేవంత్ రెడ్డికి రెండు ఓట్లు.. ఈసీ కీలక ప్రకటన

కలం, వెబ్ డెస్క్: సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy)కి రెండు ఓట్లు ఉన్నాయంటూ జరుగుతున్న ప్రచారంపై ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ముఖ్యమంత్రికి ఒకే ఎపిక్ నెంబరుతో రెండు ఓటర్ల జాబితాల్లో రావడం సాంకేతిక పొరపాటు మాత్రమే అని స్పష్టం చేసింది. ఓటర్ల జాబితాలో ఉండే తేడాలను ప్రస్తుతం జరుగుతున్న సర్ ప్రక్రియలో సరిచేస్తున్నట్లు వివరించింది.

కొడంగల్‌లో ఉంటానన్న సీఎం..

సీఎం రేవంత్ రెడ్డి తన ఓటు హక్కును కొడంగల్‌లోనే ఉంచుకుంటానని.. సొంతూరు కొండారెడ్డిపల్లిలో ఓటర్ల జాబితా నుంచి తనను తొలగించాలని ఎన్నికల సంఘాన్ని కోరినట్లు పేర్కొంది. ఒక ప్రాంతం నుంచి మరో చోటుకు ఓటును మార్చుకునే క్రమంలో రికార్డులను అప్డేట్ చేయకపోవడం వలనే ఇంకా రెండేసి ఓట్లు ఉన్నట్లు చూపించిందని వివరించింది. అయితే, ఒకే ఎపిక్ నెంబర్ రెండు ఓటర్ల జాబితాలో ఉన్నంత మాత్రాన రెండు నియోజకవర్గాల్లో ఓటు వేయడానికి అవకాశం ఉండదని స్పష్టం చేసింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>