Mobile Popup Ad
Mobile Popup Ad

మణుగూరు పోలీస్ స్టేషన్ ప్రారంభానికి సిద్ధం

కలం, ఖమ్మం బ్యూరో: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు (Manuguru) పట్టణ ప్రజలకు త్వరలోనే కొత్త పోలీస్ స్టేషన్ అందుబాటులోకి రానుంది. అంబేడ్కర్ సెంట‌ర్ వ‌ద్ద అత్యాధునిక వసతులతో నూతనంగా నిర్మిస్తున్నారు. ​మ‌ణుగూరు డీఎస్పీ ర‌వీంద‌ర్ రెడ్డి ఆదేశాల మేర‌కు సీఐ నాగ‌బాబు ప్ర‌త్యేక ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఈ స్టేష‌న్ నిర్మాణ ప‌నులు శరవేగంగా సాగి, ప్రస్తుతం తుది ద‌శ‌కు చేరుకున్నాయి.

ఆధునిక హంగులతో..

​నూతన పోలీస్ స్టేషన్ భవనాన్ని ఆధునిక హంగులతో తీర్చిదిద్దారు. అద్దాలు, ఆకర్షణీయమైన రంగులతో చూపరులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సిబ్బందికి, స్టేషన్‌కు వచ్చే బాధితులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని రకాల సౌకర్యాలతో భవనాన్ని నిర్మించారు. ​త్వరలోనే ఉన్నతాధికారుల చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించేందుకు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. స్టేషన్ అందుబాటులోకి వస్తే శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందుతాయని పట్టణవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Read Also: హాట్ టాపిక్.. తెలంగాణ బీజేపీలో ‘అవతార్ పురుష్’ సెగ..!

Follow Us On: Instagram

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>