Mobile Popup Ad
Mobile Popup Ad

చండూరు హోటళ్లు, రెస్టారెంట్లలో తనిఖీలు.. రూ. 12వేల జరిమాన

కలం, చండూరు: చండూరు (Chandur) మున్సిపాలిటీలోని హోటళ్లు, రెస్టారెంట్లలో మున్సిపల్ కమిషనర్ ఎల్. మల్లేశం ఆధ్వర్యంలో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటళ్లలో శుభ్రత, ఆహార నాణ్యత, వంటశాలలు, వ్యర్ధాల నిర్వహణ, తాగునీటి సౌకర్యాలను పరిశీలించారు. నిబంధనలను ఉల్లంఘించిన రెస్టారెంట్లపై రూ.12 వేల జరిమానా విధించారు. ఈ సందర్భంగా కమిషనర్ మల్లేశం మాట్లాడుతూ శుభ్రత పాటించి నాణ్యమైన ఆహారం అందించాలన్నారు. అలాగే ప్లాస్టిక్ కవర్లను వినియోగించుకోవద్దని యాజమాన్యాలకు సూచించారు. ఈ తనిఖీలో మేనేజర్ జి. రాములు, సీనియర్ అసిస్టెంట్ ఎ. సాయి భారద్వాజ్, వార్డ్ ఆఫీసర్ బి. సాయిరాం, పర్యావరణ ఇంజినీర్ ఎం. అరవింద్ రెడ్డి, బిల్ కలెక్టర్లు జి. మహేశ్, జి. రమేశ్, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>