కలం, మెదక్ బ్యూరో: సంగారెడ్డి (Sangareddy) జిల్లా అందోల్ గ్రామ శివారులోని సర్వే నంబర్ 1141 లో గల ప్రభుత్వ స్థలంలో కొందరు వ్యక్తులు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారంతో పోలీసులు,రెవెన్యూ అధికారులు రంగంలోకి దిగారు. ఇరువురు అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని తవ్వకాలను నిలిపివేశారు. అక్రమ మైనింగ్కు ఉపయోగిస్తున్న రెండు టిప్పర్లు, ఒక హిటాచీ జెసిబి వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సీజ్ చేసిన ఈ వాహనాలను జోగిపేట పోలీస్ స్టేషన్కు తరలించారు.

