కలం, మహబూబ్నగర్ బ్యూరో : అమావాస్య సందర్భంగా బుధవారం రోజు మహబూబ్ నగర్ (Mahabubnagar) పట్టణంలోని శ్రీ రాఘవేంద్రనగర్ (ఎస్ఆర్) కాలనీ అభయాంజనేయ ఆలయంలో ప్రత్యేక పూజలు, అభిషేక కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ఉన్న వినాయక విగ్రహాని కి ఆలయ పూజరులు పూజలు చేశారు. అనంతరం ఆంజనేయ స్వామికి అభిషేక కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్బంగా కాలనీ వాసులు స్వామి వారిని దర్శించుకున్నారు. శ్రావణ మాసం మొదలు కావడంతో ఈ ఆలయంలో ప్రతివారం ప్రత్యేక పూజలు చేస్తామని ఆలయ అర్చకులు పేర్కొన్నారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ పూజా కార్యక్రమం లో కాలనీకి చెందిన భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు.

