కలం, వెబ్ డెస్క్: తమిళనాడు సీఎం విజయ్ (CM Vijay) ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు. గురువారం చెన్నైలోని సెక్రటేరియట్లో తమిళనాడు రాష్ట్ర రవాణా సంస్థ బస్సులను విజయ్ ప్రారంభించారు. సుమారు 300 డీజిల్, సీఎన్జీ ఏసీ బస్సులు ఇందులో ఉన్నాయి. ఈ ప్రారంభోత్సవం ముగిసిన వెంటనే విజయ్ సైతం ఓ బస్సు ఎక్కి ప్రయాణించారు. బస్ కండక్టర్, ప్రయాణికులతో మాట్లాడి వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. విజయ్ బస్సులో ప్రయాణిస్తూ వీడియో కూడా తీసుకున్నారు. ఈ బస్సుల ప్రారంభోత్సవం సీఎం పుట్టిన రోజైన జూన్ 22నే జరగాల్సి ఉండగా, కొన్ని కారణాల వల్ల ఈ కార్యక్రమం నేటికి వాయిదా పడింది.

