కలం, నిర్మల్: నిర్మల్ (Nirmal) జిల్లా కేంద్రంలోని వివేక్ నగర్లో సోమవారం దుండగులు చైన్ స్నాచింగ్ (Chain Snatching)కి పాల్పడటం కలకలం రేపింది. మామడ మండలం పరిమండల్ గ్రామానికి చెందిన ఓ వృద్ధురాలు తన మనవరాలిని జిల్లా కేంద్రంలోని ఓ హాస్టల్లో దింపేందుకు వచ్చింది. ఈ క్రమంలో ఆమెను గమనించిన గుర్తు తెలియని ఇద్దరు దుండగులు పల్సర్ బైక్పై వచ్చి, వృద్ధురాలి మెడలో ఉన్న సుమారు మూడు తులాల బంగారు గొలుసును లాక్కెళ్లినట్లు బాధితురాలు ఆరోపించింది. ఈ ఘటనతో ఒక్కసారిగా స్థానికంగా తీవ్ర ఆందోళన చెలరేగింది. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని పరిసర ప్రాంతాల్లోని సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దుండగుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు.

