రేపటి తెలంగాణ క్యాబినెట్‌ సమావేశం వాయిదా

కలం, వెబ్ డెస్క్ : గురువారం ( జూన్ 18) సచివాలయం వేదికగా జరగాల్సిన తెలంగాణ క్యాబినెట్‌ భేటీ (Telangana cabinet Meeting) వాయిదా పడింది. అందుబాటులో ఉన్న మంత్రులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి రేపు భేటీ కానున్నారు. రేపు ఉ. 11.30కి సచివాలయంలో సమావేశం నిర్వహించనున్నారు. రాజకీయ అంశాలు, ప్రభుత్వ వ్యవహారాలపై సమీక్ష జరగనుంది.

నిజానికి, సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో గురువారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి మండలి సమావేశం నిర్వహించనున్నారని అంతకుముందు షెడ్యూల్ ఖరారు అయింది. అయితే తాజాగా మొత్తం మంత్రి మండలి సమావేశాన్ని వాయిదా వేశారు. కేవలం అందుబాటులో ఉన్న మంత్రులతోనే సీఎం రేవంత్ రెడ్డి ఉ. 11.30కి సమీక్ష నిర్వహిస్తారని ప్రెస్ నోట్ రిలీజ్ అయింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>