కలం, వెబ్ డెస్క్ : పాకిస్తాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ కు (Imran Khan) మరో 17 ఏళ్ల జైలు శిక్ష పడింది. తోషాకానా–2(Toshakhana Case) అవినీతి కేసులో ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ప్రత్యేక కోర్టు ఇమ్రాన్ తో పాటు అతని భార్యకు కూడా జైలు శిక్ష విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. కాగా, 2021లో సౌదీ ప్రభుత్వం అందజేసిన కానుకలను ఇమ్రాన్ ఖాన్ తక్కువ ధరలకు అమ్ముకున్నట్లు అభియోగాలతో కేసు నమోదయింది. సౌది చక్రవర్తి ఇచ్చిన 7.15 కోట్ల పాకిస్తాన్ రూపాలయల విలువైన నగలను 50 లక్షలకే అమ్ముకున్నారని దర్యాప్తులో వెల్లడైంది.
అయితే, ఇమ్రాన్ మాత్రం రాజకీయ కక్షతో తప్పుడు కేసు పెట్టారని కోర్టులో వాదించారు. ప్రస్తుతం కేసు విచారణ పూర్తవడంతో స్పెషల్ కోర్టు జడ్జీ షారుఖ్ అర్జుమంద్ తీర్పును వెలువరించారు. కోర్టు ఇమ్రాన్ ఖాన్ చర్యను ప్రభుత్వ విశ్వాసఘాతుక చర్య, అత్యంత అవినీతిమయమైన చర్యగా పేర్కొంది. పాక్ శిక్షా స్మృతి ప్రకారం.. ఇమ్రాన్ ఖాన్.. ఆయన భార్య బుష్రాకు (Bushra Bibi) కోర్టు పదేళ్ల శిక్ష విధించగా.. అవినీతి చట్టం కింద మరో ఏడేళ్ల జైలు శిక్ష వేశారు. అలాగే వారికి ఒక్కొక్కరిపపై 10 మిలియన్ డాలర్ల జరిమానా కూడా విధించారు.
కాగా, స్పెషల్ కోర్టు తీర్పును హై కోర్టులో సవాల్ చేయనున్నట్లు ఇమ్రాన్, బుష్రా లీగల్ బృందాలు తెలిపాయి. ఇప్పటికే ఇమ్రాన్ 14 ఏళ్ల జైలు శిక్షను అనుభవిస్తున్నారు. తోషాకానా–2 కేసులో ఇమ్రాన్ ఖాన్ దంపతులకు జైలు శిక్ష తీర్పు రాగానే పాకిస్తాన్ రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది. పీటీఐ పార్టీ నేతలు, ఇమ్రాన్ (Imran Khan) మద్ధతుదారులు ఆందోళనకు దిగారు.
Read Also: జూన్ నాటికి ప్లాస్టిక్ ఫ్రీ స్టేట్ గా ఏపీ : చంద్రబాబు
Follow Us On: Pinterest


