కలం, వెబ్ డెస్క్ : రాజ్యసభ ఎన్నికల (Rajya Sabha Elections) ప్రక్రియలో భాగంగా నామినేషన్ల దాఖలుకు నేడే చివరి రోజు కావడంతో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. ఈ రోజుతో నామినేషన్ల గడువు ముగియనుండగా, రేపు అధికారులు ఈ నామినేషన్లను కూలంకషంగా పరిశీలించనున్నారు. అనంతరం ఈ నెల 18వ తేదీన రాజ్యసభ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. అదే రోజు సాయంత్రం ఓట్ల లెక్కింపు పూర్తి చేసి, ఫలితాలను కూడా అధికారికంగా వెల్లడించడానికి సర్వం సిద్ధమైంది. మరోవైపు టీడీపీ తరఫున ఎంపికైన అభ్యర్థులు సానా సతీష్, రామకృష్ణ, విజయ్ ఈరోజు ఉదయం 11 గంటలకు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు.
Read Also: భారత్ ఫ్యూచర్ సిటీపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం
Follow Us On : WhatsApp

